IPL 2021: భారీ షాట్లు ఆడనివ్వలేదు: కోహ్లీ.. మాక్స్వెల్ని ఔట్ చేయాలనుకున్నాం: విలియమ్సన్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీ మాట్లాడుతూ చివర్లో తమని హైదరాబాద్ బౌలర్లు భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పాడు.
‘మేం వీలైనంత త్వరగా మ్యాచ్ను పూర్తి చేయాలనుకున్నాం. ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్లను ఆఖరివరకూ తీసుకెళ్లాలనుకోలేదు. కానీ, ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అయితే, మాక్స్వెల్ రనౌట్ కావడమే ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్గా మారింది. మరోవైపు డివిలియర్స్ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. తొలుత బౌలింగ్లో బాగా రాణించినా బ్యాటింగ్లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ క్రమంలోనే చివర్లో షాబాజ్ అహ్మద్ (14) విలువైన పరుగులు చేశాడు. ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్ అయినా సన్రైజర్స్ చివరిబంతి వరకూ పోరాడింది. ఆఖర్లో వాళ్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి మమ్మల్ని భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. మాది ప్రొఫెషనల్ జట్టు అయినందున గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాం. ఒక్కోసారి ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి. అయినా, మేం ముందుకు సాగుతుంటాం. అలాగే ఈ ఐపీఎల్ టోర్నీ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. ఉమ్రాన్ మాలిక్ లాంటి యువకుడు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం బాగుంది. ఫాస్ట్ బౌలర్లు ఇలా రాణించడం టీమ్ఇండియా క్రికెట్కు శుభపరిణామం’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
ఇక సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇది తమకు కష్టతరమైన సీజన్ అయినా ఇలాంటి విజయాలు సాధించడం గొప్పగా ఉందని చెప్పాడు. ‘చిన్న చిన్న మార్పులతో ఇలాంటి ఫలితాలు సాధించడం బాగుంది. మేం చేసింది 141 పరుగులే అయినా బెంగళూరును అడ్డుకోవడానికి సరిపోతాయని అనుకున్నాం. చివరి వరకూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఎలాగైనా మాక్స్వెల్ను ఔట్ చేయాలనుకున్నాం. అదే మా విజయానికి బాటలు వేస్తుందని భావించాం. మేం ప్లేఆఫ్స్ పోటీలో లేకున్నా ఆటగాళ్లలో ఇలాంటి పట్టుదల చూడటం అద్భుతంగా ఉంది. అలాగే మా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ప్రత్యేకమని చెప్పాలి. అతడు నెట్స్లోనూ అంతే తీవ్రంగా సాధన చేస్తాడు. మరీ ముఖ్యంగా స్లో పిచ్లపైనా తన ప్రభావం చూపిస్తున్నాడు. అతడికి జట్టులో చాలా మంది సీనియర్లు సహకరిస్తున్నారు. ఇక శుక్రవారం కూడా మేం ఇలాగే ఆడి చివరి మ్యాచ్ను గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని సన్రైజర్స్ కెప్టెన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక