IPL 2021: కింగ్ ఈజ్ బ్యాక్.. ధోనీ మరోసారి ఎగిరి గంతేసేలా చేశాడు: కోహ్లీ
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గతరాత్రి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాటింగ్ చూసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్కోహ్లీ సంబరపడ్డాడు...
మాజీ సారథిపై ప్రశంసల జల్లు..
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గతరాత్రి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాటింగ్ చూసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్కోహ్లీ సంబరపడ్డాడు. ఈ మ్యాచ్లో ధోనీ చివరి రెండు ఓవర్లలో ఒక సిక్సర్, మూడు ఫోర్లు బాది చెన్నైని ఫైనల్కు తీసుకెళ్లాడు. దీంతో అతడి అభిమానులు, పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ధోనీని మునుపటిలా చూడటం బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ సారథి సైతం మ్యాచ్ అనంతరం స్పందించాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అని మెచ్చుకున్నాడు.
ఎవరేమన్నారంటే..
* కింగ్ ఈజ్ బ్యాక్. క్రికెట్లో అతిగొప్ప ఫినిషర్ అయిన ధోనీ నాకెంతో ఇష్టం. మరోసారి నన్ను కూర్చున్న సీట్లో నుంచి ఎగిరి గంతేసేలా చేశాడు. -విరాట్ కోహ్లీ
* ధోనీ బ్యాటింగ్ చూసి సంతోషంగా ఉంది. అతడెంతో అద్భుతంగా ఆడాడు. అతడి బ్యాటింగ్ గురించి అనేక మంది మాట్లాడారు. అతడికి ఏడో నంబర్ బాగా కలిసి వస్తుంది. ఈరోజు చాలా గొప్పగా ముగించాడు. -మాథ్యూ హెడెన్
* జడేజా బాగా ఆడుతున్నా ఈసారి ధోనీనే ముందు బ్యాటింగ్కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్గా పని పూర్తి చేశాడు. -సునీల్ గావస్కర్
* వావ్.. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఓటమిపాలైన దిల్లీ జట్టు ఇంకో మ్యాచ్లో గెలవాలని ఆశిస్తున్నా. ఇక ఇప్పుడు విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు అభినందనలు. కెప్టెన్ ధోనీ మరోసారి ఫినిషర్గా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే తన ఆటగాళ్లలో స్ఫూర్తి కలిగించాడు. -ప్రీతి జింతా
* ఫినిషర్గా ధోనీది ఇదో కళాత్మక ప్రదర్శన. చాలా అద్భుతంగా ఆడాడు. అతడిలా మ్యాచ్లు ముగిస్తే ఎన్నో జ్ఞాపకాలు మన కళ్లముందు కదలాడుతాయి. - జైషా
* ఓం ఫినీషాయ నమహః! టైగర్ (ధోనీ) ఇంకా బతికే ఉంది. చెన్నై అద్భుత విజయం సాధించింది. రుతురాజ్ టాప్క్లాస్ బ్యాటింగ్కు తోడు ఉతప్ప క్లాసిక్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఇక ధోనీ ఎంత ముఖ్యమైన ఆటగాడో చూపించాడు. చెన్నైకి ఇది గొప్ప విజయం. గతేడాది ప్లేఆఫ్స్ కూడా చేరని ఆ జట్టు ఈసారి చెలరేగి ఆడింది. దీంతో మరోసారి ఫైనల్స్ చేరింది. -వీరేంద్ర సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల