T20 World Cup: చూడు పంత్.. నాకింకా చాలా మంది కీపర్లు ఉన్నారు: కోహ్లీ
రాబోయే టీ20 ప్రపంచకప్లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యువ కీపర్ రిషభ్ పంత్కు స్పష్టం చేశాడు. ధనాధన్ బ్యాటింగ్తో జట్టుకు విజయాలందించాలని కోరాడు...
ధోనీ తర్వాత అంతగొప్ప కీపర్ ఇంకా దొరకలేదు
ఇంటర్నెట్డెస్క్: రాబోయే టీ20 ప్రపంచకప్లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యువ కీపర్ రిషభ్ పంత్కు సూచించాడు. ధనాధన్ బ్యాటింగ్తో జట్టుకు విజయాలందించాలని కోరాడు. లేదంటే తనకు చాలా మంది కీపర్లు ఉన్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన యువ బ్యాట్స్మన్, కీపర్.. అందుకు తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసార హక్కుదారులు తాజాగా ఓ సరదా యాడ్ రూపొందించారు. అందులో కోహ్లీ, పంత్ మధ్య ఇలాంటి సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో కోహ్లీ, పంత్ వీడియో కాల్లో మాట్లాడుతూ ఇలా ముచ్చటించారు.
కోహ్లీ: పంత్.. టీ20ల్లో సిక్సులే మ్యాచ్లు గెలిపిస్తాయి.
పంత్: నువ్వేం కంగారు పడకు సోదరా.. నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు.. వికెట్ కీపరే టీమ్ఇండియాకు సిక్సర్ కొట్టి ప్రపంచకప్ గెలిపించాడు. (2011లో శ్రీలంకపై ధోనీని ఉద్దేశించి)
కోహ్లీ: నిజమే కానీ, ధోనీ భాయ్ తర్వాత టీమ్ఇండియాకు అంత గొప్ప వికెట్ కీపర్ ఇంకా దొరకలేదు.
పంత్: నేను కూడా టీమ్ఇండియా కీపరే..
కోహ్లీ: చూడు పంత్.. నాకు చాలా మంది కీపర్లు అందుబాటులో ఉన్నారు. వార్మప్ మ్యాచ్ల్లో ఎవరెలా ఆడుతారో చూద్దాం. అంటూ సరదాగా మాట్లాడుకున్నారు.
ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈలో నేటితో పూర్తవుతుంది. ఇక ఈనెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 18, 20వ తేదీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఆపై 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలిపోరులో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ను మరింత ఎక్కువ మంది వీక్షించేందుకు ప్రసార హక్కుదారులు వినూత్న రీతిలో యాడ్లు రూపొందించారు. మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలోనూ రూపొందించిన మరో యాడ్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!