T20 World cup: ఆస్ట్రేలియా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు: విలియమ్సన్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన తుదిపోరులో కంగారూలు తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘మేం గెలవడానికి ప్రయత్నాలు చేసినా పిచ్ సహకరించలేదు. ఈ దుబాయ్ పిచ్ కాస్త కఠినంగా ఉంది. మేం పలు భాగస్వామ్యాలు నిర్మించి పోరాడేందుకు కావాలిసినంత లక్ష్యాన్ని నిర్దేశించడం బాగుంది. కానీ, ఆస్ట్రేలియా దాన్ని సునాయాసంగా ఛేదించింది. అదో అద్భుతమైన జట్టు. ఈ క్రమంలోనే మేం గెలుపొందడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
‘మా ఆటగాళ్లు కచ్చితమైన ప్రణాళికలతో వచ్చి ఆడినా ఆస్ట్రేలియా ప్లేయర్లు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే, మా జట్టు అంకితభావం పట్ల నేను గర్వపడుతున్నా. తుదిపోరు వరకూ వచ్చి మా అత్యుత్తమ ప్రదర్శన చేసినా సరిపోలేదు. యూఏఈలో ఒక పిచ్తో మరో పిచ్కు పోలికే లేదు. అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకుసాగాం. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు క్రెడిట్ దక్కుతుంది. ఈరోజు వాళ్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. ఫైనల్కు చేరేసరికి మాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమే. అందులో ఏదైనా జరగొచ్చు’ అని న్యూజిలాండ్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు.
అతిపెద్ద విజయం..గర్వంగా ఉంది: ఆరోన్ ఫించ్
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ జట్టు తరఫున తొలి టీ20 ప్రపంచకప్ అందుకోవడం కెప్టెన్గా గర్వంగా ఉందన్నాడు. ‘ఇది అతిపెద్ద విజయం. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా నిలవడం అద్భుతంగా ఉంది. మా జట్టులో పలువురు అత్యద్భుత వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. మరికొన్ని మ్యాచ్ల్లో జట్టుగా రాణించాం. వార్నర్ పని అయిపోయిందని చాలా మంది విమర్శలు చేశారు. అలాంటప్పుడే అతడు మరింత బాగా ఆడతాడు. నా మటుకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అంటే ఆడం జంపా. ఇక మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అమోఘం. వేడ్, స్టోయినిస్ కూడా ఈ టోర్నీలో బాగా ఆడారు’ అని ఫించ్ సంతోషం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. -
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్