Virat Kohli: కొంచెం తీపి... ఎక్కువ చేదు.. ఇదీ విరాట్ ఇయర్ రివ్యూ
ఆధునిక క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్.. నిలకడకు మరోపేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే రారాజు.. ఫీల్డింగ్లో చిరుత.. ఫిట్నెస్లో సాటిలేని మేటి...
కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్న నాయకుడు
ఆధునిక క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్.. నిలకడకు మరోపేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే ఛేదన రారాజు... ఫీల్డింగ్లో చిరుత.. ఫిట్నెస్లో మేటి. ఆటగాడిగా విరాట్ కోహ్లీ గురించి చెప్పమంటే ఎవరన్నా ఈ మాటలే చెబుతారు. గతేడాది కాలంలో విరాట్ ఇలానే ఉన్నాడు. అయితే కెప్టెన్గా మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు అతడి పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే చెబుతూ... ఈ ఏడాది అతడి ప్రదర్శన ఎలా సాగిందో రివైండ్ చేసుకుందాం.
ఆటగాడిగా అదుర్స్..
ఆటగాడిగా కోహ్లీ రికార్డుల గురించి అందరికీ తెలుసు. 2016 సీజన్లో అతడి పరుగుల వరద, శతకాల జోరును ఎవ్వరూ మర్చిపోలేరు. ఐపీఎల్లో మొత్తం 207 మ్యాచులాడిన అతడు 37.39 సగటు, 129.94 స్ట్రైక్రేట్తో 6,283 పరుగులు చేశాడు. 5 శతకాలు, 42 అర్ధశతకాలూ సాధించాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2021లో 15 మ్యాచులు ఆడి 405 పరుగులు చేశాడు. నిజానికి ఐపీఎల్లో పరుగుల పరంగా కోహ్లీని మించిన ఆటగాడు మరొకరు లేనేలేరు. ఎన్నో రికార్డులు అతడి పేరిట లిఖించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 443 మ్యాచుల్లో 55కి పైగా సగటు, సుమారు 80 స్ట్రైక్రేట్తో 23,159 పరుగులు చేశాడు. 70 శతకాలు, 118 అర్ధశతకాలు, 2,301 బౌండరీలు, 238 సిక్సర్లు బాదేశాడు.
ప్చ్.. కప్పు లేకుండానే...
ఐపీఎల్లో ఏటా ‘ఈ సాలా కప్ నమదే’ అని వచ్చే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి అలాంటి హడావిడి లేకుండానే అడుగుపెట్టింది. లీగు మ్యాచ్ల్లో బాగా ఆడి ప్లేఆఫ్స్ బెర్తును కాస్త ముందుగానే ఖరారు చేసుకొని అభిమానులకు కొంచెం సంతోషం కలిగించింది. అయితే, కోహ్లీ అంతకుముందే ఆర్సీబీ కెప్టెన్గా ఇదే తన చివరి టోర్నీ అని ప్రకటించి షాకిచ్చాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు బాగా ఆడి ప్లేఆఫ్స్ చేరడంతో ఈసారైనా కప్పు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ మరోసారి ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. ఎలిమినేటర్లో కోల్కతా చేతిలో ఓటమిపాలైన కోహ్లీసేనను చూసి అటు బెంగళూరు, ఇటు విరాట్ అభిమానులు ఎంత బాధపడ్డారో చెప్పడం కష్టం. గొప్ప ఆటగాళ్లుండి 14 సీజన్లలో ఒక్కసారీ ఆ జట్టు ట్రోఫీ అందుకోలేదు. చివరికి టైటిల్ సాధించకుండానే కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీకి దూరమయ్యాడు.
ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ బెంగళూరుకే ఆడుతున్నాడు. యువకుడిగా మొదలైన అతడి ప్రస్థానం సారథిగా మలుపు తిరిగింది. 2013లో జట్టు బాధ్యతలు తీసుకొని భారీ అంచనాల నడుమ ఏటా బరిలోకి అడుగుపెట్టాడు. కానీ విఫలమయ్యాడు. ఎప్పుడూ జట్టులో ఏదో ఒక లోపం ఉండనే ఉంటోంది. తొలుత బ్యాటింగ్ విభాగానికి మాత్రమే ప్రాధాన్యం ఉండేది. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోలేదు. ఇప్పటికీ ఆ జట్టులో మంచి విదేశీ పేసర్ కనిపించడం లేదు. ఇదివరకు క్రిస్గేల్, ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్ వంటి భీకరమైన బ్యాట్స్మన్ ఉన్నా గెలుపు బాట పట్టింది లేదు. ఈసారి గ్లెన్ మాక్స్వెల్ మెరుపులు మెరిపించినా ఫైనల్ చేరలేకపోయింది. కోహ్లీ సారథ్యంలో ఎనిమిదేళ్లలో ఒక్కసారే ఫైనల్ చేరినా సాధించిందేమీ లేదు.
ఎప్పుడూ నాకౌట్లలో.. ఈసారి లీగుల్లో
బ్యాట్స్మన్గా తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ నాయకుడిగా కీలక సందర్భాల్లో విఫలమవుతున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు గెలవడం, లీగు మ్యాచుల్లో విజయ దుందుభి మోగించడం పక్కనపెడితే ఐపీఎల్ ఫ్లేఆఫ్స్, ఐసీసీ నాకౌట్స్లో అభిమానులకు గుండెకోత మిగల్చడం తెలిసిందే. ఆయా టోర్నీల్లో సాంతం అదరగొట్టి నాకౌట్ లాంటి కీలక మ్యాచుల్లో చేతులెత్తేసే విరాట్.. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లోనే విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో టీమ్ఇండియా ఈ ఏడాది ఇంటా, బయటా ఇంగ్లాండ్పై సిరీస్ విజయాలు సాధించడం, అంతకుముందు ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడం కూడా మనమంతా చూశాం. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఓటమిపాలై మరోసారి తడబడ్డాడు. తాజాగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో చిత్తుగా ఓడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే, కొన్నిసార్లు వ్యూహాలు, మార్పులతో ఇబ్బందులు పడుతున్న విరాట్.. మరికొన్ని సార్లు ఆటగాళ్ల వైఫల్యంతో చతికిల పడుతున్నాడు.
పొట్టి కప్పు అందుకోలేడా?
టీ20 ప్రపంచకప్లోనూ టీమ్ఇండియా సెమీస్ చేరడమే ఇప్పుడు ఇతర జట్ల ఆటతీరుపై ఆధారపడింది. మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా... వేరే జట్ల మ్యాచ్ల ఫలితాలవైపు చూడాల్సిన పరిస్థితి. అలాంటిది కప్పు సాధించడం అంటే అత్యాశే అవుతుంది. కానీ.. అదృష్టం కలిసొచ్చి.. తర్వాతి మ్యాచ్ల్లో టీమ్ఇండియా చెలరేగి.. న్యూజిలాండ్, అఫ్గాన్ జట్ల రన్రేట్ కన్నా మెరుగైతే సెమీస్ చేరే అవకాశం ఉంది. ఇదీ గతేడాదిగా విరాట్ కోహ్లీ బ్యాట్స్మన్ అండ్ కెప్టెన్ గ్రాఫ్. ఈ ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీని వదులుకుంటున్న విషయం తెలిసిందే. కాబట్టి కెప్టెన్గా దిగుతూ దిగుతూ... విరాట్ జట్టుకు కప్ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ విరాట్.. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు