Venkatesh Iyer: హర్భజన్ ముందే చెప్పాడు .. కానీ నమ్మలేకపోయా: అయ్యర్
వెంకటేశ్ అయ్యర్కు ఈ ఏడాది సమ్థింగ్ స్పెషల్... ఐపీఎల్ 14వ సీజన్లో అదరగొట్టిన ఆల్రౌండర్ను...
ఇంటర్నెట్ డెస్క్: వెంకటేశ్ అయ్యర్కు ఈ ఏడాది సమ్థింగ్ స్పెషల్... తన తొలి ఐపీఎల్ సీజన్లోనే అదరగొట్టిన ఈ ఆల్రౌండర్కు భారత జట్టులోకి ఆహ్వానం అందింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్, కుడిచేతివాటం మీడియం పేసర్ వెంకటేశ్ అయ్యర్ భారత్ జట్టు తరఫున టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. కివీస్తో తొలి మ్యాచ్లో బౌలింగ్ చేయని అయ్యర్ (4) బ్యాటింగ్లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రెండో బంతికే పెవిలియన్కు చేరాడు. కీలకమైన ఆఖరి ఓవర్లో ఫోర్ కొట్టడంతో ఒత్తిడి తగ్గి కివీస్పై టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది. మరోవైపు రెండు దశల్లో జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపాడు. కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు. కేకేఆర్ తరఫున 10 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్ 128 స్ట్రైక్రేట్తో 370 పరుగులు సాధించారు. అందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 67 పరుగులు. బౌలింగ్లోనూ మూడు వికెట్లను పడగొట్టాడు.
అయితే గత ఐపీఎల్లో తన ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముందే అంచనా వేశాడని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 14 సీజన్లో హర్భజన్ కూడా కేకేఆర్ జట్టులోనే ఉన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే హర్భజన్ నాతో సూటిగా చెప్పేశాడు. అయితే అప్పటికి నేను తుది జట్టులో ఉంటానో లేదో కూడా తెలియదు. భజ్జీ నన్ను నెట్ప్రాక్టీస్ సెషన్స్లో చూసి ఉంటాడమో. ‘ఈసారి కేకేఆర్ అంటే నువ్వే. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా చేసి చూపిస్తారు’ అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యా. నిజం చెప్పాలంటే నేను నమ్మలేదు. అసలు ప్రాక్టీస్లో నా బ్యాటింగ్ కూడా చూసి ఉండడు. ఎందుకు ఈయన ఈ విధంగా చెబుతున్నాడు అని కూడా ఆలోచించా. భజ్జీలోని మంచి వ్యక్తిత్వం నన్ను ఓదార్చడం కోసమే ఇలా చెప్పిందేమో అనుకున్నా’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్లో రాణించి కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించినందుకు నిజంగా సంతోషపడినట్లు వివరించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్