IPL 2022: హార్దిక్ పాండ్య కష్టమే.. సారథ్యం వైపు శ్రేయస్ చూపు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలునలుగురు.....
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా వస్తోన్న అహ్మదాబాద్, లఖ్నవూ జట్లకు మెగా వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించనుంది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యాలు ఎవరిని ఉంచుకుంటాయి..? మళ్లీ వేలంలో ఎవరిని తీసుకుంటాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నవంబర్ చివరి నాటికి రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది. తాను ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తానని, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తనను రిటెయిన్ చేస్తుందనే నమ్మకం లేదని ఇప్పటికే డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ముంబయి, దిల్లీ జట్లు ఎవరిని రిటెయిన్ చేసుకుంటాయనే దానిపై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
హార్దిక్ విషయంలో కష్టమే..
అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ అయిన ముంబయి ఇండియన్స్ ఎవరిని రిటెయిన్ చేసుకుంటుందనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముంబయి ఇండియన్స్లో అందరూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లే. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉందనే చెప్పాలి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్యను ఉంచుకునే అవకాశాలు చాలా తక్కువని ఐపీఎల్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండేళ్ల కిందట హార్దిక్ సూపర్ ఫామ్లో ఉండేవాడని.. ప్రస్తుతం బౌలింగ్ చేసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. అదే సమయంలో బ్యాటింగ్లోనూ రాణించడం లేదు. అయితే పాండ్యను రిటెయిన్ చేసుకోకపోయినా, వేలంలో మాత్రం ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ముంబయి ఇండియన్స్ రిటెయిన్ చేసుకునే టాప్-4 జాబితాలో రోహిత్, బుమ్రా, పొలార్డ్, సూర్యకుమార్/ఇషాన్ కిషన్ ఉండొచ్చని విశ్లేషించారు.
* ఐపీఎల్ 14వ సీజన్లో ఆల్ రౌండర్ పాత్రకు హార్దిక్ న్యాయం చేయలేదనే చెప్పొచ్చు. 12 మ్యాచులు ఆడిన పాండ్య కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కటంటే ఒక్క అర్ధశతకం లేదు. అత్యధిక స్కోరు 40* పరుగులు. ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్లకుగాను ఒక అర్ధశతకంతో 281 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 60* పరుగులు.
* 12 మ్యాచుల్లో ఒక్క మ్యాచులోనూ బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. గతేడాదీ ఇదే పరిస్థితి. వెన్నెముక గాయమైనప్పటి నుంచి బ్యాటింగ్, బౌలింగ్లో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనూ బౌలింగ్ చేయలేదు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ వచ్చే మ్యాచుల్లో బౌలింగ్ చేస్తాడనే నమ్మకమూ తక్కువే. హార్దిక్ బదులు వేరే బ్యాటర్ను లేదా ఆల్రౌండర్ను తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.
కెప్టెన్సీ వైపు అయ్యర్ చూపులు..!
శ్రేయస్ అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు. సారథిగా గత సీజన్లో డీసీని ఫైనల్కు చేర్చిన అయ్యర్ను కాదని ఈ సీజన్లో రిషభ్ పంత్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో డీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 21 మొదటి దశకు దూరం కాగా.. రెండో దశకు అందుబాటులోకి వచ్చాడు. యూఏఈ ఎడిషన్లో శ్రేయస్ ఎనిమిది మ్యాచుల్లో 175 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే డీసీ యాజమాన్యం కెప్టెన్గా పంత్నే కొనసాగించింది. దిల్లీని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపి ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వచ్చే సీజన్కు పంత్ను కాదని అయ్యర్కు సారథ్యం అప్పగించే అవకాశాలు తక్కువే. అయితే టాప్ బ్యాటర్ అయిన శ్రేయస్ను రిటెయిన్ చేసుకునేందుకు మాత్రం డీసీ మొగ్గు చూపుతుంది. అయితే సారథ్యం ఇవ్వకపోతే వచ్చే సీజన్లో దిల్లీకి ఆడేందుకు అయ్యర్ ఇష్టపడకపోవచ్చు. అవకాశం ఉంటే కొత్తగా వస్తున్న జట్లలో ఒకదానికి కెప్టెన్గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త సారథుల కోసం వేట మొదలెట్టాయని.. అందుకే అయ్యర్ చూపు కెప్టెన్సీ వైపు మళ్లినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్ చేసుకోవాలంటే మాత్రం శిఖర్, పంత్, శ్రేయస్, హెట్మెయిర్, పృథ్వీషా, రబాడా, నార్జే ఆటగాళ్లలో నలుగురిని అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. మరి ఎవరిని రిటెయిన్ చేసుకుంటారో వేచి చూద్దాం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు