Bandi Sanjay: సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం
నల్గొండ, మిర్యాలగూడలలో రాళ్లు రువ్వుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు
భాజపా రాష్ట్రాధ్యక్షుడి కాన్వాయ్పైనా దాడి, పలు వాహనాలు ధ్వంసం
నల్గొండ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, నల్గొండ- సూర్యాపేట గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తొలుత నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సంజయ్ అక్కడికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు సంజయ్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రతిగా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెరాస కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో భాజపా కార్యకర్తలు వారి పైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా తోపులాటకు దిగడంతో ఐకేపీ కేంద్రంలోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం చెల్లాచెదురైంది. పలువురు రైతులు ఇరుపార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఉన్న కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై తెరాస కార్యకర్తలు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శెట్టిపాలెం వద్ద ధాన్యాన్ని మిల్లులకు తీసుకువచ్చిన రైతులతో మాట్లాడటానికి వచ్చిన సంజయ్కు వ్యతిరేకంగా అక్కడే ఉన్న తెరాస శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా.. ఓ టీవీ ఛానల్ విలేకరితో పాటు పలువురు తెరాస, భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సంజయ్ కాన్వాయ్పై మూసి బ్రిడ్జి వద్ద తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాన్వాయ్ను సూర్యాపేట జిల్లాలోకి అనుమతించారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద భాజపా, తెరాస వర్గీయుల ఘర్షణ.. అడ్డుకుంటున్న పోలీసులు
వాహనశ్రేణి దారి మళ్లింపు
శాంతిభద్రతల దృష్ట్యా సంజయ్ కాన్వాయ్ను సోమవారం రాత్రి 8 గంటలకు సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్ వైపు దారి మళ్లించారు. తెరాస శ్రేణుల దాడి కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. వాహనశ్రేణిని ఇమాంపేట మీదుగా జానారెడ్డి నగర్కు తరలించారు. రాత్రి 11 గంటలు దాటాక సంజయ్ సూర్యాపేటకు వెళ్లి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు గృహంలో బస చేశారు. మరోవైపు సంజయ్ పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినా నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని తెరాస, భాజపా శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎస్పీలిద్దరూ స్పష్టమైన ఆదేశాలిచ్చినా రెండు జిల్లాల అధికారులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శెట్టిపాలెం వద్ద రాళ్ల దాడిలో గాయపడిన తెరాస కార్యకర్త
ఇరుపార్టీల నేతలపై కేసు నమోదు
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: నల్గొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న భాజపా, తెరాస నేతలు, కార్యకర్తల దాడుల్లో ఇరు వర్గాలపై ఫిర్యాదులు వచ్చినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్రెడ్డి తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై స్థానిక ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సంజయ్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, తెరాస నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశామన్నారు.
పోలీసుల సహకారంతోనే దాడులు: సంజయ్
పెన్పహాడ్, గన్ఫౌండ్రి- న్యూస్టుడే: పోలీసుల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెన్పహాడ్ మండలం జానారెడ్డినగర్లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తిరగబడి దాడులకు పాల్పడతారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ వద్ద ఉందని, అందుకే అసహనంతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెరాస శ్రేణుల దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. కేసీఆర్ తన పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జనగామలో మంగళవారం పదాధికారుల అత్యవసర సమావేశం జరుగుతుందని, అక్కడ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంజయ్ వెల్లడించారు. నల్గొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజినీ వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ప్రతి గింజా కొంటామని చెప్పి, ఇప్పుడు కేంద్రంపై ఆ నెపం వేస్తున్నారన్నారు. 2023లోగా ధాన్యం మద్దతు ధరను రెట్టింపు చేస్తామన్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్, తెరాస నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించాలని భాజపా నేత ఎన్.రాంచందర్రావు డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.
నేరేడుచర్ల వద్ద రాళ్ల దాడిలో ధ్వంసమైన భాజపా కాన్వాయ్లోని కారు అద్దాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు