Omicron: తస్మాత్ జాగ్రత్త
కరోనా మూడో దశ ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది.
మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు సమీక్ష
వివరాలు వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్రావు
ఈనాడు, హైదరాబాద్: కరోనా మూడో దశ ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ముప్పు తగ్గుతుందని, ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండు డోసులు పూర్తిచేసుకున్న ఆరు నెలలకు బూస్టర్డోసు అవసరమని, దీనిపై కేంద్ర మార్గదర్శకాలు వచ్చేవరకు ప్రజలు వేచి ఉండాలని కోరింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్రావు ఆదివారమిక్కడ వైద్యశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్రావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్రెడ్డి వెల్లడించారు. ప్రజలు మాస్కు ధారణ, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒమిక్రాన్ ప్రభావంపై స్పష్టమైన అవగాహన రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని.. క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతి వేడుకల్లో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విమానాశ్రయాల్లో పరీక్షిస్తున్నాం
ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్కాంగ్లలో బయటపడింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిపెట్టాం. రెండు డోసుల టీకా తీసుకున్నవారిని ఇంటికి పంపించి, క్వారంటైన్ చేస్తున్నాం. టీకా తీసుకోని, పాక్షికంగా తీసుకున్నవారికి పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలించి, వైరస్ జీనోమ్ విశ్లేషణకు సీడీఎఫ్డీకి పంపిస్తున్నాం.
డెల్టాతో పోల్చితే 30 రెట్ల తీవ్రత!
కరోనా వైరస్లో ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. కొన్ని బలహీనంగా ఉంటే.. మరికొన్ని బలంగా ఉంటాయి. డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోకి ఈ వైరస్ చేరకుండా జాగ్రత్తపడుతూ తక్కువ నష్టంతో బయటపడాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లల్ని పాఠశాలలకు పంపించవచ్చు..
శీతాకాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్లు విజృంభిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను నిరభ్యంతరంగా పాఠశాలలకు పంపించవచ్చు. అక్కడక్కడ పిల్లలకు కరోనా సోకుతున్నా.. వ్యాధి తీవ్రం కావడం లేదు. కరోనా నిర్ధారణ అయిన పిల్లలను ఒంటరిగా ఉంచాలి’’ అని డాక్టర్ శ్రీనివాస్రావు సూచించారు.
విస్తృతంగా టీకా ప్రత్యేక డ్రైవ్లు
ఒమిక్రాన్ ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా టీకాలు తీసుకోని 10 శాతం మందికి తొలి డోసు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రెండో డోసు టీకా తీసుకోని వారి కోసం ప్రత్యేక డ్రైవ్లను విస్తృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడో ముప్పుని ఎదుర్కొనేందుకు 60,099 పడకలు సిద్ధం చేసిన ప్రభుత్వం అవసరమైన పరికరాలు, సౌకర్యాల కోసం రూ.424 కోట్లు వెచ్చించనుంది. ఇందులో 27,966 పడకలు ప్రభుత్వ వైద్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్ పడకలే. పిల్లల కోసం ప్రత్యేకంగా పది వేల పడకలు సిద్ధం చేసి.. రూ.256 కోట్లు ఖర్చు చేస్తోంది. చిన్నారుల కోసం ప్రభుత్వంలోనే 2 వేల ఐసీయూ సహా 6 వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 132 ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధమవుతున్నాయి.
25 లక్షల మంది రెండో డోసుకు దూరం..
రాష్ట్రంలో కరోనా కేసుల్లో పెరుగుదల లేదు. రోజుకి 100-150 కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు అర్హుల్లో 90 శాతం మందికి ఒక డోసు టీకా అందింది. వీరిలో 45 శాతం మందికి రెండో డోసు ఇచ్చాం. తొలిడోసు టీకా పొందిన 25 లక్షల మంది నిర్ణీత గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు. వీరంతా టీకా వేయించుకోవాలి. అమెరికా, యూకే తదితర దేశాల్లో అసలు టీకా తీసుకోని, రెండో డోసు పూర్తికాని వారిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది.
- ప్రజారోగ్యశాఖ సంచాలకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్