
సిద్ధిటెక్: ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా సిద్ధిటెక్ పట్టణంలో సిద్ధి వినాయక ఆలయానికి వచ్చేవారికి షేక్హ్యాండ్ ఇస్తూ వార్తల్లోకెక్కింది. ఈ శునకం ప్రత్యేకతపై అరుణ్ లిమాడియా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వీధి శునకం సిద్ధివినాయక ఆలయం బయట మెట్లను ఆనుకొని ఉన్న పెద్ద గోడపై కూర్చొని ఉంది. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులకు షేక్హ్యాండ్ ఇవ్వడం, ఒక చేతితో దీవించడంతో దీన్ని అంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ శునకం చేసే పనులను చూసి భక్తులు మురిసిపోతున్నారు.
ఓ వ్యక్తి ఆలయం నుంచి బయటకు వస్తుండగా ఆ శునకాన్ని చూసి నమస్కరిస్తూ తన తలను కాస్త కిందకు వంచగా.. అతడిని దీవించడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ శునకంపై ప్రశంసలు కురిపిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. భారీ సంఖ్యలో లైక్లు, షేర్లు వస్తుండటంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ క్యూట్ వీడియో మీరూ చూడండి.
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్కి ముందే తెలుసు
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..!
- జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత